05-05-2025 01:19:28 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 4 (విజయక్రాంతి)నిబద్ధత నిజాయితీగల రాజకీయ నాయకుడు చేకూరి కాశయ్య అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. ఆదివారం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంట ర్లో మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్, గురుదక్షిణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చేకూరి కాశయ్య కాంస్య విగ్రహాన్ని వారు ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు లు మాట్లాదారు. చేకూరి కాశయ్య నిబద్ధత, నిజాయితీ గల నాయకుడని, వారితో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషం అనిపించిందని వారి విగ్రహాన్ని కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఏర్పాటు చేసేందుకు నా సహకారం ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అందరికీ సుపచరితుడు చేకూరి కాశయ్య. కొత్తగూడెం నడిబొడ్డులో చేకూ రి కాశయ్య విగ్రహ ప్రతిష్ట ఏర్పాటుకు మాజీ మంత్రి వనమా కృషి అమోఘమని, అధికారులు వద్దన్నా పట్టు పట్టి చేకూరి కాశయ్య విగ్రహ ప్రతిష్ట కు వనమా ఈ స్థలాన్ని కేటాయించడం చాలా సంతోషమన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు రుక్మందర్ బండారి, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగబాబు, గౌస్, హుస్సేన్, మజీద్, బొమ్మిడి రమాకాంత్, బంధుగుల శ్రీధర్, B. శీను, హైమత్ వినోద్, సురేందర్, ఆవునూరు చంద్రయ్య, దూడల కిరణ్, జానీ, అశోక్, నగేష్, వాసు మల్ల గౌతం పాల్గొన్నారు.