29 March, 2026 | 8:12 PM

దాయాదిపై అలవోకగా..

24-02-2025 12:43 AM
  1. పాక్‌ను చిత్తు చేసిన భారత్
  2. 6 వికెట్ల తేడాతో ఘనవిజయం
  3. సెంచరీతో మెరిసిన కోహ్లీ

దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరగులకే పరిమితమైంది.  ఇండియా ౪౨.౩ ఓవర్లలో ౪ వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు.