12 March, 2026 | 10:33 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

తీన్మార్ మల్లన్న ఆఫీసు ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

05-12-2025 12:34 AM
  1. పెట్రోలు పోసుకుని, ఒంటికి నిప్పు
  2. బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్

మేడిపల్లి, నవంబర్ 4 (విజయక్రాంతి): తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు  పెట్రోల్ పోసుకొని, ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా పోచంపల్లికి చెందిన సాయి ఈశ్వర్ (35)కు భార్య కవిత(30), ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జగద్గిరిగుట్ట ముగ్ధంనగర్‌లో నివసిస్తున్నారు.

గురువారం సాయంత్రం సాయి రాష్ట్రంలో, బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా, మోసం చేసిందని, దీనిపై తీన్మార్ మల్లన్న పోరాటం చేయాలని, క్యూ న్యూస్ ఆఫీసుకి వెళ్లాడు. మల్లన్న ఆఫీసులో లేరని చెప్పడంతో కిందికి వచ్చి క్యూ న్యూస్ కార్యాల యం ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు, ఫైర్ ఇంజన్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి గాంధీ ఆస్పత్రికి తరలించారు.