17 April, 2026 | 11:48 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

బాలిక వెంటపడిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు

29-03-2025 12:59 AM

జగిత్యాల, మార్చి 28 (విజయక్రాంతి): జిల్లాలోని కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన నిందితుడు ఎండి.అంకుష్ అనే 20 ఏళ్ల వ్యక్తి ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నా నని వెంటపడి, అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 2019 సంవత్సరంలో కోడిమ్యాల పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్‌ఐ శివకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశా రు.

శుక్రవారం సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టగా, న్యాయమూర్తి నీలిమ సాక్ష్యులను విచారించి, నేరం రుజువవడంతో నిందితు డికి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ. 25 వేలు జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. కాగా ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ రామకృష్ణరావు, సిఎంఎస్ ఎస్‌ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ సాగర్, సిఎంఎస్ కానిస్టేబుల్ కిరణ్, రాజులను జిల్లా ఎస్పీ  అశోక్’కుమార్ అభినందించారు.