17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

జిల్లాలో 5 ఎకరాల పంట నష్టం

27-02-2026 05:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజుల్లో కురిసిన వడగళ్ల వాన బలమైన గాలుల వల్ల పంట నష్టం వివరాలు అంచనా వేయడం జరిగిందన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో జరిగిన ప్రాథమిక అంచనాల ప్రకారం, జిల్లా వ్యాప్తంగా సుమారు 5,000 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.

ముఖ్యంగా మక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పంట పొలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను యుద్ధ ప్రతిపాదికన సిద్ధం చేయాలని ఆమె సూచించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతుల వివరాలను త్వరితగతిన నమోదు చేసి, ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.