22 April, 2026 | 2:56 PM

Breaking News

కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •  

మరో పన్ను భారమా?

28-08-2024 12:00 AM

ఇప్పటికే పెరిగిన భూమి రిజిస్ట్రేషన్ల భారాలతో ప్రజలు సతమతమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మళ్లీ భూముల ధరలు ఇతర రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు వార్తలు చదువుతున్నాం. ఇప్పటికి పన్నులు లేని సేవలపై స్టాంపు డ్యూటీ వేయడం సబబు కావచ్చు. కానీ, ఉన్నవాటిపై మరింతగా పెంచడం సరైన పద్ధతి కాదు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారమే అవుతుంది. ఇతర సేవలకు కార్పొరేట్ కంపెనీలకు లేదా విదేశీ కంపెనీల లీజు అగ్రిమెంట్లు, ప్రకటనలకు, బడా వ్యాపార వ్యవహారాలు, క్రయ విక్రయాలు వంటివాటిపై స్టాంపు డ్యూటీ వేయండి. కానీ, సామాన్య ప్రజలపై మాత్రం అదనపు భారం మోపవద్దు.

- శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్