02-11-2024 12:45:17 AM
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాం తి): ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో 384 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మైనార్టీ శాఖకు 255, పంచాయతీరాజ్ 60, విద్యుత్శాఖ 24, రెవెన్యూ 15, ఇతర శాఖలకు 31 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య దరఖాస్తులు స్వీకరించారు.