17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలి

11-04-2025 01:16 AM

మునగాల ఏప్రిల్ 10:- సూర్యాపేట జిల్లా మునగాల రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయంలో తప్పక అందజేయాలి అని ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ ఆన్నారు. గురువారం దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న వివరాలతో పాటు జిరాక్స్ కాపీలను ఆధార్ కార్డు ఆదాయ ధ్రువీకరణ లేదా  రేషన్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం ఫోటో వికలాంగులైనట్లయితే సదరం సర్టిఫికెట్ వ్యవసాయ ఆధార లోను కైతే భూమి పట్టాదారు పాస్ పుస్తకం విద్యా అర్హతలు సర్టిఫికెట్లు  జతచేసి ఇవ్వాలని తెలియజేశారు.

ఆన్లైన్లో నమోదు చేసుకున్న దరఖాస్తులు ఇవ్వనివారు వెంటనే కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు ఇప్పటివరకు  1727 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు 529 మాత్రమే సమర్పించారు ఇంకా దరఖాస్తులు ఆఫీసులో సబ్మిట్ చేయని వారు వెంటనే అందజేయగలరు.

ఈనెల 14 వరకు చివరి రోజు కావున లబ్ధిదారులు గడువు తేదీలోగా ఆన్లైన్ చేసుకోవాలని   బి శిరీష మండల ప్రత్యేక అధికారి  ఉపముఖ్య కార్య నిర్వహణ అధికారి జిల్లా ప్రజా పరిషత్ మరియు ఎంపీడీఓ  కె. రమేష్ దీన్ దయాల్ ఒక సంయుక్త ప్రకటన లో తెలిపినారు.