3 April, 2026 | 12:08 AM

Districts - Suryapet

article_48863432.webp
గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి: సర్పంచ్ విజయశాంతి అప్పారావు

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ కార్యక్రమాన్ని సర్పంచ్ విజయశాంతి అప్పారావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, జరిగిన జరగవలసిన అభివృద్ధి గురించి గ్రామ సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, ఉపసర్పంచ్,వార్డు సభ్యులు గ్రామ పెద్దలు,మహిళలు,అన్ని ప్రభుత్వశాఖలవారు,ప్రజాప్రతినిధులు,మాజీప్రజాప్రతినిధులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

02-04-2026

article_25730048.webp
వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయం

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని 19వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం వార్డు సభ నిర్వహించారు. కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుండి పలు రకాల సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరబాబు, ముండ్ర రామారావు, ధరావత్ హాజీనాయక్, పోటు రంగారావు, విద్యాసాగర్ రావు, యాదగిరి రావు, ఖాదర్, మౌలానా, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

02-04-2026

article_74248136.webp
దొరల గర్వమణిచిన వీరుడు పాపన్న గౌడ్

​గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 316వ వర్ధంతి (ఆత్మ బలిదాన్ దినోత్సవం) వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మండల, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.​ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు రాంబాబు గౌడ్ మాట్లాడుతూ... నాటి కాలంలోనే దొరల అహంకారానికి, పెత్తందారుల అరాచకత్వానికి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సామాన్యులను ఏకం చేసి పోరాటం చేసిన ధీశాలి పాపన్న గౌడ్ అని కొనియాడారు. బహుజన రాజ్యాధికారం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదన్నారు. గౌడ సంక్షేమ సంఘం ​మండల అధ్యక్షులు పోలంపల్లి ఆనంద్ బాబు గౌడ్ మాట్లాడుతూ..పాపన్న గౌడ్ ఒక వ్యక్తి కాదని, ఒక గొప్ప శక్తి అని అభివర్ణించారు. కేవలం 12 మందితో తన ప్రస్థానాన్ని ప్రారంభించి,12 వేల మంది సైన్యాన్ని తయారు చేసుకున్న ఆయన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గౌడ కుటుంబంలో అటువంటి వీరుడు జన్మించడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు.

02-04-2026

article_64504314.webp
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

మఠంపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని,ఉన్నంత విద్య అభ్యసించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

02-04-2026