17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

13 ఏళ్ల తర్వాత దర్శకుడిగా..

31-03-2025 12:05 AM

‘సిరా’ అనే లఘుచిత్రంతోపాటు ‘మిథునం’ వంటి క్లాసికల్ సినిమాతో తనను దర్శకుడిగానూ నిరూపించుకున్నారు ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘మిథునం’ అప్పట్లో ప్రేక్షక హృదయాలను హత్తుకుంది.

అంతేనా, ఉత్తమ మాటల రచయిత (తనికెళ్ల భరణి) సహా నాలుగు నంది అవార్డులను సొంతం చేసుకుందీ సినిమా. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్లీ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు భరణి. ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారాయన. 20 మధ్య వయసున్న యువతతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని.. ప్రస్తుతం హీరోహీరోయిన్ సహా ఇతర పాత్రధారులను ఎంపిక చేసే పనిలో ఉన్నామని తెలిపారు.