16 April, 2026 | 9:45 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మెదడు వయసుకు చెక్!

20-04-2025 12:00 AM

మెదడు.. శరీరంలో ఓ భాగమైతే కావచ్చు. కాని దానికంటూ స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. మనం వందేళ్లు బతకాలంటే.. వందేళ్లపాటు స్థిమితంగా ఆలోచించగలగాలి. మంచిచెడుల్ని విశ్లేషించే పదును ఉండాలి. ఇదంతా జరగాలంటే.. మెదడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాని అరవై నిండిన తర్వాత ఏటా 0.5 శాతం చొప్పున మెదడు పనితీరు మందగిస్తూ వస్తుంది. ఆ క్షీణతను అడ్డుకోవాల్సిందే.

మెదడుకు బద్ధకాన్ని అలవాటు చేయకూడదు. నిత్యం ఏదో ఓ పని చెప్పాలి. సవాళ్లు విసరాలి. పజిల్స్, చదరంగం, పుస్తక పఠనం లాంటివి ఆ ప్రయత్నంలో సహకరిస్తాయి. పర్యటనలు మెదడును మరింత యవ్వనంగా ఉంచుతాయి. ఎందుకంటే ప్రతి ప్రయాణం తర్వాతా ఎన్నో కొన్ని అనుభూతుల్ని మూటగట్టుకుని వస్తాం.

ఆ సరికొత్త జ్ఞాపకాలు మెదుడుకు విటమిన్ టాబ్లెట్‌తో సమానం. మెదడు ఆరోగ్యంలో ధ్యానం పాత్రా కీలకమైందే. పోషకాలు, సామాజిక సంబంధాలు.. మొదలైనవి గుండెకే కాదు, మెదడుకూ మంచి చేస్తాయి. అందులోనూ ఒత్తిడి కారణంగా స్రవించే కార్టిసోల్ హార్మోన్ మెదడును ప్రధాన శత్రువని గుర్తించారు నిపుణులు.