తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఏపీ సీఎం చర్చలు
25-08-2024 04:41 PM
ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ముఖ్యనేతలతో చంద్రబాబు చర్యలు
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్యనేతలతో చంద్రబాబు చర్యలు జరిపారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత ఏపీ సీఎం తెలంగాణ కార్యకర్తలను కలవనున్నారు. కార్యకర్తలు చంద్రబాబును కలిసేందుకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు పెద్దఎత్తున చేరుకున్నారు.






