2 March, 2026 | 9:49 PM

ఆ పాఠశాలలో ఒక్కడే విద్యార్థి

02-03-2026 08:13 PM

కోదాడ,(విజయక్రాంతి): మండల పరిధిలోని  తమ్మర బండ పాలెంలో ఇష్టానుసారంగా ప్రాథమిక పాఠశాల కు సెలవులు ప్రకటించుకోవచ్చు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఒక విద్యార్థి మాత్రమే ఉండగా వారిలో ఒక ఉపాధ్యాయుడు  డిప్టేషన్ పై వెళ్లగా మరో ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి మాత్రమే ఉన్నారు. దీంతో ఆ ఉపాధ్యాయుడికి లీవ్ పెట్టినప్పుడల్లా ఆ పాఠశాలకు సెలవులు వస్తాయి. విద్యార్థిని స్కూల్ నుండి పంపిన కానీ ఆ పాఠశాలకు సెలవు వస్తుంది ఎవరు ఉండరు కాబట్టి.

ఈ విధంగా విద్యార్థులు ఆ పాఠశాలలో లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆడంధీ ఆటగా పాడంధీ పాటగా తయారైంది. వేలల్లో జీతాలు తీసుకుంటూన్నారు. కనీసం విద్యార్థుల సంఖ్య పెంచలేకపోవడం విడ్డురంగా మారింది అనే గ్రామస్తులు తెలుపుతున్నారు. పై అధికారులు స్పందించి  ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అని అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలను తనిఖీ నిర్వహించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.