15 July, 2026 | 2:31 AM

మెదక్ చర్చికి.. నాకు గొప్ప అనుబంధం ఉంది

25-12-2024 04:47 PM

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నాడు మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ కేథడ్రల్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావుల కోరిక మేరకు చర్చి అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు. తాను పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు చర్చిని సందర్శించానని, ముఖ్యమంత్రి హోదాలో తిరిగి వస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లతో దళిత, గిరిజన క్రైస్తవులు ఎక్కువ లబ్ధి పొందుతారని తెలిపారు. అదనంగా, ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు.