4 March, 2026 | 7:58 PM

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు

30-11-2025 01:59 PM

వలిగొండ,(విజయక్రాంతి): రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వలిగొండ మండలంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వలిగొండ మండలంలోని వివిధ నామినేషన్ కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద జనం గూమ్మిగూడకుండ చూడాలని అన్నారు. నామినేషన్ కు అభ్యర్థితో పాటు బలపరిచిన అభ్యర్థులను మాత్రమే పోలింగ్ నామినేషన్ కేంద్రాల్లోకి పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ ఎంపీడీవో జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.