కోట కె గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్... 47ద్విచక్ర వాహనాలు స్వాధీనం
బోథ్, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): సోనాల మండలంలోని కోట (కె) గ్రామంలో శనివారం ఉదయం 5 గంటల నుంచి సీఐ గురుస్వామి(CI Guruswamy) ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దాదాపు 100 మంది పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించగా, 47 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ గురుస్వామి(CI Guruswamy) మాట్లాడుతూ.. 174 ఈ-చలాన్ కేసుల్లో రూ.41,315 వసూలు చేయడం జరిగిందన్నారు. అంతేగాక నంబర్ ప్లేట్ లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. గుడుంబా, గంజాయి వంటి వాటికి యువత దూరంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తం, బజార్హత్నూర్ ఎస్ఐ రమేష్, పోలీసులు పాల్గొన్నారు.






