మహిళా సంఘాలకు బస్సుల నిర్వహణ బాధ్యతలు
ఆదిలాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడమే కాకుండా, స్వయంగా ‘ఈ- ల’ నిర్వహణను జిల్లా సమాఖ్యకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా చేపట్టిన ‘మహాలక్ష్మి’ పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి, సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
01-04-2026