calender_icon.png 27 June, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు

25-06-2025 12:00:00 AM

  1. మధ్యాహ్నం 12.01 గంటలకు యాక్సియం మిషన్  ప్రయోగం
  2. రోదసిలోకి వెళ్లనున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు

న్యూఢిల్లీ, జూన్ 24: భారత్‌కు చెందిన శుభాన్షు శుక్లా అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుభాన్షు బృందం బుధవారం యాక్సియం మిషన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేం ద్రం (ఐఎస్‌ఎస్)కు పయనం కానున్నారు. నేడు మధ్యాహ్నం  12.01 గంటలకు (భారత కాలామన ప్రకా రం) ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో యాక్సియం ప్రయో గం జరగనున్నట్టు నాసా తెలిపింది.

గురువారం సాయంత్రం 4.30 గం టలు డాకింగ్ సమయంగా పేర్కొం ది. ఇప్పటికే ఈ అంతరిక్ష యాత్ర పలుమార్లు వాయిదా పడింది. ఫాల్కన్ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ క్యాప్సూల్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

శుభాన్షు శుక్లా మిషన్ పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. అమెరి కాకు చెందిన డా. పెగ్గీ విట్‌సన్ మిషన్ కమాండర్‌గా.. పోలండ్‌కు చెందిన సాల్వోజ్, హంగేరికి చెందిన టిబోర్ మిషన్ స్పెష లిస్టులుగా బృందంలో ఉన్నారు. నా సా, ఐరోపా అంతరిక్ష సంస్థ, ఇస్రో లు కలిసి సంయుక్తంగా ఈ ప్రయో గం చేపడుతున్నాయి.