వారి పోస్టులు డిలీట్ చేయండి

18-04-2024 02:18:26 AM

ట్విట్టర్ ‘ఎక్స్’కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ పెట్టిన పోస్టులను తొలగించాలని ట్విట్టర్ ఎక్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తదితరులు చేసిన పోస్టులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా ఉన్నాయని ఆక్షేపించింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి విమర్శలు చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఈసీ తెలిపింది. అలాంటి పోస్టులను తొలగించాలని ఏప్రిల్ 2, 3వ తేదీల్లో ట్విట్టర్‌కు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని తిరిగి ఏప్రిల్ 10వ తేదీన ఈసీ వివరణ కోరింది. వాటిపై చర్యలు తీసుకున్నట్టు ట్విట్టర్ తాజాగా ప్రకటించింది.