13 July, 2026 | 9:46 PM

Breaking News

నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •  

డీజీపీ వాట్సాప్‌ ఫొటోతో మోసాలు.. డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని ఫోన్

21-05-2024 11:22 AM

హైదరాబాద్: సైబర్ నేరాలకు అంతులేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో నేరాలు పెరిగిపోయాయి. కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు ఒడిగట్టారు. వాట్సప్ డీజీపీ రవిగుప్తా ఫొటో డీపీగా పెట్టి మోసాలు చేస్తున్నారు. వ్యాపారవేత్తకు, అతడి కుమారైకు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని, ఆ కేసులో అరెస్ట్ చేస్తున్నామని ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు.

డ్రగ్స్ కేసు నుంచి తప్పించేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన వ్యాపార వేత్త సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాకిస్థాన్ కోడ్+92తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.