12-04-2025 12:00:00 AM
ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాత హర్షిత్రెడ్డి ఆస్ట్రేలియన్ కా న్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. హైదరాబాద్కు విచ్చేసిన ఈ బృం దంలో డిప్యూటీ కాన్సు ల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు. భారత్ మధ్య, ముఖ్యంగా సినిమా, సాంస్కృతిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే విషయమై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఇరు దేశాల మధ్య సినిమా సహ నిర్మాణాలు (కో సాంస్కతిక కార్యక్రమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల మారకం (టాలెంట్ ఎక్సేంజ్) వంటి పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా ప్రతినిధులు ఈ సమావేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై, తెలుగు సినిమాపై ఎంతో ఆసక్తి, ఉత్సాహం చూపించారు. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల సృజనాత్మక రంగాల మధ్య బంధం మరింత బలపడుతుందని, ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఇరు పక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.