11 March, 2026 | 2:29 PM

Breaking News

పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •   కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. రాజకీయ రంగంలో విషాదం   •  

పాఠశాలకు బీరువాలు, కార్పెట్లు అందజేత

11-03-2026 12:03 AM

మునుగోడు, మార్చి 10 : చదువుకున్న పాఠశాలపై ప్రేమతో పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తూ మునుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ జిల్లా పరిషత్ పాఠశాలకు మూడు బీరువాలు, ఆరు కార్పెట్లు సొంత ఖర్చుతో అందజేశారు.భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్, విద్యార్థుల సౌకర్యార్థం ఈ సామగ్రిని పాఠశాలకు అందించారు.

విద్యార్థులు స్టడీ అవర్ సమయంలో మైదానంలో కూర్చొని చదువుకోవడానికి కార్పెట్లు ఉపయోగపడతాయని తెలిపారు.అడగకముందే పాఠశాలపై ఉన్న ప్రేమతో బీరువాలు, కార్పెట్లు అందజేయడం పట్ల పాఠశాల సిబ్బంది సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు పాఠశాల అభివృద్ధికి ముం దుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి మహిళా ఉపాధ్యాయులు,

విద్యార్థినిలతో కలిసి సర్పంచ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల తరఫున సర్పంచ్ దంపతులను ఘనంగా సన్మానించారు. మహిళా టీచర్లు, సిబ్బందిని సర్పంచ్ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయు లు బాల ప్రసాద్, ఉపాధ్యాయులు కే. సత్తిరెడ్డి, రత్నయ్య, అన్నపురెడ్డి, వెంకటేశ్వర్లు, బాబురావు, రాజేశ్వర్ తదితర ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.