4 May, 2026 | 3:14 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

ఏలేటి చిలుక జోతిష్యుడిగా సూటవుతారు: అడ్లూరి

02-11-2024 12:48 AM

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి  ఎమ్మెల్యేగా కంటే.. చిలుక జోతిష్యుడిగా బాగా నప్పుతారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని మారుస్తారని, రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే.. ఆయనపై జాలేస్తుందని అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మండిపడ్డారు.

మీడియాలో పాపులారిటీ కోసమే మహేశ్వర్‌రెడ్డి అవగాహనలేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో ఎమ్మెల్యేలంతా ప్రజా సమస్యల కోసం పని చేస్తున్నారని స్పష్టం చేశారు.