19 May, 2026 | 10:19 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

బోడుప్పల్‌లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

12-12-2024 10:45 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ లో ఇన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘట్కేసర్  ఏక్సైస్  స్టేషన్ హౌస్ ఆఫీసర్ జూప్పల్లి రవి తెలిపిన వివరాల ప్రకారం... ఏక్సైస్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ ఆదేశాల మేరకు బోడుప్పల్ లో వీరేంద్ర అనే వ్యక్తి బీహార్ నుండి గంజాయి చాకలెట్స్ తెచ్చి అమ్ముతున్నాడని పక్కా సమాచారం అందింది. దీంతో ఘట్ కేసర్ లిమిట్ బి బృందం గురువారం బోడుప్పల్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుని నుండి 4.957 కేజీల గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తదుపరి విచారణ కొరకు ఘట్ కేసర్ ఎస్.హెచ్ఓకు అప్పగించారు.