22 March, 2026 | 1:27 PM

ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్

16-11-2024 02:35 AM

సెంట్ లూసియా: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో సఖీబ్ మహ్ముద్, ఓవర్టన్  చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.