9 March, 2026 | 11:00 PM

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

09-03-2026 03:18 AM

ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి 

ఘట్ కేసర్, మార్చి 8 (విజయక్రాంతి) : పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’  ’99-డేస్ యాక్షన్ ప్లాన్’లో భాగంగా ఆదివారం ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలో ‘స్వచ్ఛ సండే డ్రైవ్ విత్ స్వచ్ఛ సాథిస్ అరౌండ్ పబ్లిక్ పారక్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోచారం డివిజన్లోని అన్నోజిగూడ పార్కులో జరిగిన ఈకార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వాణి పాల్గొన్నారు.

కాలనీవాసులు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల భాగస్వామ్యంతో పార్కు ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. ఈసందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పబ్లిక్ పార్కులను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ 99 రోజుల ప్రణాళికను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని  తెలిపారు.