15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సముందర్ తాండాలో చలివేంద్రం ఏర్పాటు

05-04-2025 10:39 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని సమందర్ తండాలో శనివారం కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు ఇందిరాబాయి ఆధ్వర్యంలో సముందర్ తాండ బస్టాండ్ స్కూల్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరాబాయి మాట్లాడుతూ... దారిన పోయే బాటసారులకు ప్రయాణికులకు స్కూల్ పిల్లలకు అందరికీ దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన సంఘసంస్కర్త అని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళ మండల అధ్యక్షురాలు ఇందిరాబాయి, మాజీ సర్పంచ్ బాబు సింగ్, కార్యదర్శి సాయిలు, తులసి రామ్, గని రామ్, హరిదాస్, గ్రామస్తులు తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.