2 May, 2026 | 10:09 PM

ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు

02-05-2026 08:57 PM

రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ గ్రామీణ మండలం, నూకలమర్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ రోమాల ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్ హాజరై అభినందించారు.

పరీక్షల్లో గంగ దీక్షిత 555 మార్కులతో మొదటి స్థానం, వర్ణిక్ 537 మార్కులతో, అభినయ్ 499 మార్కులతో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా రోమాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల విజయానికి కృషి, ఉపాధ్యాయుల అంకితభావమే కారణమని పేర్కొన్నారు. చదువుకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఫౌండేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.