30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఐదుగురు జూదరుల అరెస్ట్

31-03-2025 10:14 AM

ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): పేకాట వస్తావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురి జూదరులను అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్(Adibatla Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండల పరిధి( Ibrahimpatnam mandal) కొంగరకలాన్ గ్రామ శివారులో ఉన్న జామ తోటలో గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిభట్ల పోలీసు దాడి చేసి పట్టుకున్నారు. జూదరుల వద్ద నుండి 5 మొబైల్ ఫోన్లు, 3 వాహనాలతో పాటు రూ. 60,230 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.