22 April, 2026 | 2:05 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఆహార కల్తీ క్షమార్హం కాదు

31-10-2024 12:00 AM

నేడు అన్ని రకాల ఉత్పత్తులలో నా ణ్యత లోపిస్తున్నది. కల్తీ జరుగుతోంది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులలో ఈ మధ్య దారుణాలు జరుగుతున్నాయి. నిల్వ చేసిన, కుళ్లిన ఆ హారపదార్థాలు విక్రయిస్తున్నారు. ప్ర జల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మొన్న నగరంలోని స్వీట్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు . అన్నీకాలం చె ల్లిన నాసిరకం సరుకులు వేసి తయారు చేసినవిగా గుర్తించారు. అలాగే చాలా స్వీట్ షాపులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ సర్టిఫికెట్ కూడా లేకపోవడం దారుణం.

అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ స రుకు లతో తయారుచేసిన తినుబండారా లు తినడం వల్ల ప్రజలకు ఎంతో అ నారోగ్యాలు కలుగుతాయి. ఇటీవల రోడ్డుపై విక్రయిస్తున్న మొమోస్ తిని ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన చూశాం. మన దేశంలో ఆహార రంగంపై అసలు శ్రద్ధ వహించరు.  ఎ క్కడ ఎలా తయారు చేస్తారని కూడా ఆలోచించరు. అందుకే రోడ్డుపై తయారు చేసే చిరుతిండ్లు, హోటల్స్‌లో చేసే పదార్థాలలో కల్తీ జరు గుతోంది. అదే అమెరికాలాంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల విని యోగం లో కఠిన చట్టాలు ఉంటాయి.

అక్కడి ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం కొరకు తీవ్ర కృషి చేస్తాయి. ఇక్కడి మాదిరి నాణ్యత లేని కల్తీ ఆహార ఉత్పత్తులను ఏమాత్రం సహించరు. కానీ మన దేశంలొ ఏ మాత్రం పట్టించుకోరు. ఏదైనా జరిగితే వెంటనే హడావిడి చే స్తారు. నాలుగు రోజులకు మళ్లీ మామూలే. ప్రభుత్వం ఇకనైనా ఆ హార రంగంలో కఠిన చట్టాలు తేవాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి.

-శ్రిష్టి శేషగిరి,సికింద్రాబాద్.