11 May, 2026 | 9:37 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

భారే గూడెంలో గాలికుంటు వ్యాధి టీకాలు ప్రారంభం

17-03-2026 07:22 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూరు మండలం బారెగూడెం గ్రామంలో బెజ్జూరు పశువైద్యాధికారి రాకేష్ ఆధ్వర్యంలో భారగూడెం సర్పంచి తేలి సుశీల మంగళవారం గాలి కుంటు టీకాల కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు గాలికుంటు వ్యాధి టీకాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని, రైతులు పశువులకు టీకాలు  వేయించి పశువులను కాపాడుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బెజ్జూర్ పశువైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ కుడిమత జితేందర్, గోపాలమిత్ర మనోహర్, నాయకులు తేలి బాపు రైతులు పాల్గొన్నారు.