2 May, 2026 | 8:17 PM

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

02-05-2026 07:16 PM

* సర్పంచ్ చింతా వెంకటేశ్వర్లు

గుండాల,(విజయక్రాంతి): శనివారం కురిసిన అకాల వర్షం, గాలి దుమారానికి మండల పరిధిలోని చీమలగూడెం గ్రామంలో బొర్రా కాంతారావు ఇల్లు పై కప్పు(రేకులు) మొత్తం లేసిపోయి వారి కుటుంబం మొత్తం నిరాశ్రయులు అయ్యారని, జోగా కృష్ణ, ధనసరి ప్రభాకర్, ఈసం కాంతారావు, మాడె సురేందర్ రైతులకు చెందిన సుమారు 100 క్వింటాల మొక్కజొన్న ధాన్యం మొత్తం తడిసి పోయిందని లింగగూడెం సర్పంచ్ చింతా వెంకటేశ్వర్లు వాపోయారు. ప్రభుత్వం వెంటనే అకాల వర్షంతో నష్టపోయిన వారిని ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.