30-05-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే29(విజయ క్రాంతి): ప్రస్తుత అకాల వర్షాలు నేపథ్యంలో జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం రెబ్బెన మండ లం ఎడవెల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, గత వారం రోజుల నుం డి వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్ కవర్లు అవ సరమైన మేరకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తేమ శాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు.
కొనుగోలు ప్రక్రియను జాప్యం చేయకూడదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, తీసుకువచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, రెబ్బెన తహసిల్దార్ సూర్యప్రకాష్ రావు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.