30-05-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, మే 29 : విద్యార్థులు టాయిలెట్లు కడిగితే తప్పేంటి అన్న సాం ఘిక సంక్షేమ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి వ్యాఖ్యానాలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. విద్యార్థుల పట్ల అనుచితం గా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన గురుకుల కార్యదర్శి అలుగు వర్షినినీ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎంహెచ్డీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఆందోళనకు దిగారు.
టాయిలెట్లు కడుగుతే తప్పేంటి అన్న ఎస్సి గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణిని విధుల నుంచి తొలగించి ఆమె అహంకారానికి తగిన బుద్ధి చెప్పాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు డిమాండ్ చేశారు. అలుగు వర్షిణి ఒక వీడియోలో మాట్లాడుతూ గురుకుల పాఠ శాల లో విద్యార్థులు టాయిలెట్లు కడుగుతే తప్పేంటి, వారి రూమ్లు వారే క్లిన్ చేసుకోవాలి, వారి బట్టలు వారే ఉతుక్కోవాలని, ఎవరొచ్చి చేస్తారనీ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.
అంతే కాకుండా విద్యార్థులు ఏమైనా పైకులం నుంచి వచ్చా రా? అని విద్యార్థుల పట్ల అవమాన కరంగా మాట్లాడిన ఆమెకు కార్యదర్శిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి కాబట్టే ఆమె గురుకుల పాఠ శాలలకు సెక్రటరీగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం హెచ్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్, సీనియర్ నాయకుడు నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, జిల్లా కార్యదర్శి ప్రసాద్, నాయకులు శేఖర్, నియోజక వర్గ ఇంచార్జి శివాజీ, పట్టణ అధ్యక్షుడు సంపత్, పట్టణ కార్యదర్శి మల్లేష్, కోశాధికారి వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.