13 April, 2026 | 4:23 PM

Breaking News

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •  

25న జీఎస్టీ రేట్ల కమిటీ సమావేశం

23-09-2024 12:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించేందుకు పన్ను రేట్లను సమీక్షించేందుకు  జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల గ్రూప్ (జీవోఎం)ను సెప్టెంబర్ 25న సమావేశం కానుంది. గోవాలో జరిగే ఈ సమావేశంలో పన్ను రేట్లను, శ్లాబుల్ని చర్చిస్తారని కేంద్ర అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఆరుగురు సభ్యులుగల ఈ కమిటీ గత ఆగస్టులో ఒక దఫా సమావేశమై సెప్టెంబర్ 9న కౌన్సిల్‌కు స్టాటస్ రిపోర్ట్‌ను సమర్పించింది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం శ్లాబుల్లో జీఎస్టీ పన్ను రేట్లు అమలవుతున్నాయి. నిత్యావసరాలకు పన్నును మినహాయించడమో లేదా కనిష్ఠశ్లాబ్‌లో పన్ను వసూలు చేస్తుండగా, లగ్జరీ, డీమెరిట్ ఐటెమ్స్‌కు గరిష్ఠ శ్లాబ్‌లో పన్ను రేటు ఉన్నది. 

12,18 శాతం పన్ను శ్లాబ్‌ల్ని విలీనం చేసే యోచన

ప్రస్తుతం అమలులో ఉన్న 12, 18 శాతం శ్లాబుల్ని విలీనం చేయాలన్న చర్చలు జరుగుతున్నప్పటికీ, అం దుకు సంబంధించిన ప్రతిపాదన కౌ న్సిల్ ముందుకు రాలేదు. ఈ విధం గా 18 శాతం రేటును 12 శాతం శ్లాబ్ లో కలిపితే రెవిన్యూ న్యూట్రల్ రేటు 15.3 శాతంలోపునకు తగ్గుతుం ది. ఈ కారణంగా జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ తెరపైకి వచ్చింది. పశ్చిమ బెంగాల్, కర్నాటక రాష్ట్రాలు జీఎస్టీ శ్లా బ్స్‌ను మార్చడానికి సానుకూలంగా లేవు.