జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని *పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజులు ఏప్రిల్ 1వ తేది నుండి 30 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరదాని, నిబంధనలకు విరుద్డిదంగా డి.జే వినియోగించారాదని తెలిపారు.
శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.




