17-06-2025 01:40:53 PM
నాగ్పూర్: కొచ్చి నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం(IndiGo Flight) మంగళవారం నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్(Emergency Landing) అయిందని అధికారులు వెల్లడించారు. 6E2706 విమానం మొదట మస్కట్ నుండి కొచ్చికి చేరుకుని ఉదయం 9:31 గంటలకు 157 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బందితో ఢిల్లీకి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (Cochin International Airport Limited) అధికారిక ఐడికి విమానాన్ని బెదిరిస్తూ ఇమెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు అంచనా కమిటీ (Bomb Threat Assessment Committee) వెంటనే సమావేశమై అప్రమత్తమై వెంటనే విమానాన్ని నాగ్పూర్కు మళ్లించారు. సురక్షితంగా ల్యాండ్ చేసి విమానంలోని ప్రయాణీకులందరినీ కిందికి దింపారు. భద్రతా సంస్థలు విమానంలో క్షుణ్ణంగా తనిఖీ ప్రారంభించాయి. భద్రతా తనిఖీల అనంతరం విమానం ఢిల్లీకి తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తుందని ఇండిగో, విమానాశ్రయ అధికారులు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబైకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇటీవల కాలంలో విమానాలకు వరుస బాంబు బెదిరింపు వస్తున్న విషయం తెలిసిందే.