9 May, 2026 | 5:32 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

గతిశక్తితో కొత్త ఆవిష్కరణలు

14-10-2024 03:28 AM

ప్రధాని మోదీ

ఢిల్లీ, అక్టోబర్ 13: దేశంలో మరిన్ని నూతన ఆవిష్కరణలు రావడానికి గతిశక్తి ప్రాజెక్టు ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన పోస్ట్‌లో మోదీ పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలలో మార్పులు తీసుకురావడానికి 2021 అక్టోబర్ 13న ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్(పీఎంజీఎస్ ఎన్‌ఎంపీ)ను అమలులోకి తీసుకువచ్చినట్లు పీఎం తెలిపారు.

దీన్ని ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ గతిశక్తి ప్రాజెక్టుల కారణంగా మౌలిక రంగాలు వేగంగా, సమర్థవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.  దేశంలోని రైల్వేలు, రోడ్లు, పోర్ట్స్, ఎయిర్‌పోర్ట్స్, లాజిస్టిక్  వంటి మౌలిక రంగాల అభివృద్ధిలో గతిశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవడాని గతిశక్తి ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.