15-08-2025 09:29:42 PM
ఏఎంసీ ఏరియాలో రాత్రి వరకు మువ్వన్నెల జెండా రెపరెపలు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నప్పటికీ జాతీయ జెండాకు అవమానం జరిగింది. పట్టణంలోని ఏఎంసి ఏరియాలో ఆవిష్కరించిన జాతీయ జెండాను రాత్రి 7:30 గంటల వరకు అవనతం చేయకుండా వదిలేశారు. ఉదయం ఆవిష్కరించిన జాతీయ జెండాను సాయంత్రం 6 గంటలలోపు అవనతం చేయడం గౌరవంగా భావిస్తారు. కానీ ఉదయం ఎగరేసిన జాతీయ జెండా రాత్రి వరకు రెపరెపలాడుతూ తన అత్యున్నత గౌరవాన్ని కోల్పోయింది.రాత్రి 8 గంటల తర్వాత జాతీయ జెండాను అవనతం చేశారు.