17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇంటెన్స్ డ్రామా ఆకట్టుకుంటుంది

03-04-2025 12:00 AM

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నుంచి వస్తున్న కొత్త సినిమా ‘శారీ’. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు గిరికృష్ణ కమల్ సైకలాజి కల్ థ్రిల్లర్ కథతో రూపొందించారు. రవిశంకర్‌వర్మ నిర్మి స్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యం లో మేకర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఆర్జీవీ మాట్లాడుతూ.. “సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితం లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలున్నాయనే పాయింట్ మీద చేసిన చిత్రమే ‘శారీ” అన్నారు.

హీరో సత్య యాదు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఒక ఇంటెన్స్ డ్రామాతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. ‘ఈ సినిమా చేయడం నాకొక వర్క్‌షాప్‌లా అనిపించింది’ అని హీరోయిన్ ఆరాధ్యదేవి తెలిపింది. డైరెక్టర్ కమల్ మాట్లాడుతూ.. ‘రెండు పాత్రలతోనే ప్రధానంగా సాగే ఇంటెన్స్ డ్రామా ఇది’ అన్నారు.