టెల్ అవీవ్, ఏప్రిల్ 23: లెబనాన్లోని హిజ్బొల్లా స్థావరా లపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. మొదట ఇజ్బొల్లా కత్యూష రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడిచేసింది. ఇజ్రాయెల్లో సోమవారం యూదులు పవిత్రంగా భావించే పాసోవర్ సెడర్ మీల్ పండుగను జరుపుకొంటున్న సమయంలో హిజ్బొల్లా 35 రాకెట్లను ప్రయోగించింది.
వీటిని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకొన్నది. ఆ తర్వాత లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలుగా భావిస్తున్న భవనాలపై వైమానికదాడులు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్లో పోస్ట్చేసింది. కాగా, గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ భీకర దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడికి ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ ఘోర వైఫల్యమే కారణమనే విమర్శలు వచ్చాయి. అందుకు ఆధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి మేజర్ జనరల్ అహరోన్ హలివా ఓమవారం రాజీనామా చేశారు.