7 August, 2026 | 5:06 PM

Breaking News

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి   •   సౌత్ ఇండియా కరాటేలో స్టెమ్‌స్పార్క్ విజయం   •   సిద్దిపేట టిఐసిసిఐ కో-ఆర్డినేటర్‌గా బిక్షపతి   •   గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •  

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

07-08-2026 04:34 PM

ఎంపీడీఓ కు వినతి పత్రం

దమ్మపేట,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీఓ రవీంద్రారెడ్డికి పంచాయతీ కార్మికులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మురహరి రఘు మాట్లాడుతూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 10న జైలు భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తుందని విమర్శించారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు విజయలక్ష్మ, యశోద, మల్లేశ్వరి, భవాని, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.