7 July, 2026 | 7:34 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందడం హర్షనీయం

03-04-2025 04:48 PM

మేడ్చల్ (విజయక్రాంతి): పార్లమెంటులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం హర్షనీయమని బిజెపి రాష్ట్ర నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. బిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టి, బిసి, ఓసి, ముస్లిం, క్రిస్టియన్, దేవాలయాల భూములు కాపాడుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. ఇతరులు, ప్రభుత్వ భూములు తమవేనని వక్ఫ్ బోర్డు గెజిట్ జారీ చేసుకోవడం వల్ల అనేకమంది ఆస్తులు కోల్పోయారన్నారు. ఇకనుంచి ఇలాంటి అవకాశం ఉండదని, ఎవరి భూములపై వారికే హక్కులుంటాయన్నారు.