29 July, 2026 | 11:19 AM

Breaking News

పెరిగిన రూపాయి విలువ.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు   •   లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ధర్నా   •   రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన పెద్ద ప్రమాదం   •   ఇల్లందు అభివృద్ధిపై పొంగులేటితో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చ   •   గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మంత్రులు   •   మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్   •   నవీపేట రైల్వే స్టేషన్‌కు కొత్త రైల్వే ప్లవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి   •   పొంగి పొర్లుతున్న నల్లవాగు మత్తడి   •   సీనియర్ జర్నలిస్ట్ రామ్‌ కుమార్‌ను పరామర్శించిన మంథని మీడియా ప్రెస్ క్లబ్   •   బూర్గంపాడు పంచాయతీ కార్యాలయంలో డీపీవో ఆకస్మిక తనిఖీ   •  

అవినీతి సీనియర్ అసిస్టెంట్‌కు జైలు

08-11-2024 12:47 AM

20 వేలు జరిమానా విధించిన కోర్టు

రాజేంద్రనగర్, నవంబర్ 7: లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. వివరాలిలా ఉన్నాయి.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో గతంలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ జిలగం వెంకటేశ్వర్‌రావు 2013లో ఓ ఫ్లాట్ మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

అప్పట్లో కేసు నమోదు చేసిన అధికారులు ఏసీబీ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసుపూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి గురువారం నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.