calender_icon.png 2 June, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించనున్న కవిత

31-05-2025 02:37:03 PM

హైదరాబాద్: తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) కొత్త కార్యాలయం శనివారం సాయంత్రం ప్రారంభం కానుంది. బంజారాహిల్స్(Banjara Hills)లో నూతన జాగృతి కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) ప్రారంభించనున్నారు. జూన్ 4న ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు.

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు(Kalvakuntla Chandrashekar Rao) కాళేశ్వరం కమిషన్ నోటీసులు(Kaleshwaram Commission Notices) ఇవ్వడానికి నిరసనగా ఆందోళన చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత నిరసనకు పిలుపునిచ్చారు. పార్టీ అధినేతకు నోటీసులు ఇస్తే పార్టీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరి కింద పనిచేయనని కేసీఆర్ నేతృత్వంలోనే పనిచేస్తాని ఇటీవల నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో కవిత వెల్లడించారు. కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ పై కేటీఆర్ మండిపడ్డారు.