05-02-2026 10:52:56 AM
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో(Bijapur District) గురువారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో బీజాపూర్ జిల్లా పెదగెల్లూరు అటవీ ప్రాంతంలో జరిగింది. మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత ఉదమ్ సింగ్(Udham Singh) మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి