3 May, 2026 | 12:22 PM

మే 10న జన ఆగ్రహ సభ.. పార్టీ నాయకులతో కిషన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం

03-05-2026 11:10 AM

హైదరాబాద్‌: మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబడనున్న జన ఆగ్రహ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచ్చేయనున్నారు. ఈ జన ఆగ్రహ సభను విజయవంతం చేయుటకు సంబంధించి నాగోల్ డివిజన్ లోని  శుభం కన్వెన్షన్ హాల్లో ముఖ్యమైన విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని దశ దిశ నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతోపాటు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ స్థాయి కమిటీ సభ్యులు హాజరయ్యారు.