2 May, 2026 | 8:18 PM

మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక

02-05-2026 06:46 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ లీగల్ అవేర్నెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ కు చెందిన కేకే చారి మానవ హక్కుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేకే చారి మాట్లాడుతూ పేద ప్రజలకు గరీబోళ్లకు ఈ పదవి ద్వారా మరింత సహకారం, సేవలు అందిస్తానని తెలిపారు. అనంతరం శనివారం బాధ్యతలు స్వీకరించారు. మల్కాజ్గిరి డివిజన్ ఏసిపి చక్రపాణి సిఐ ఆంజనేయులు చేతుల మీదుగా ఆయన ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. మానవహక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డి. కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.