1 April, 2026 | 7:11 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

కోహ్లీ ఎన్నాళ్లకెన్నాళ్లకు

31-01-2025 01:21 AM

న్యూఢిల్లీ: పుష్కరకాలం తర్వాత రంజీల్లో బరిలోకి దిగిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు ఢిల్లీ స్టేడియానికి పోటెత్తారు. నేడు ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఏడో రౌండ్‌లో రైల్వేస్‌తో ఢిల్లీ ఆడుతోంది. మ్యాచ్ చూడడానికి 10 వేల మంది వస్తారని భావించిన డీడీసీఏకు ఊహించని షాక్ తగిలింది.

దాదాపు 15 వేల మంది అభిమానులు స్టేడియానికి రావడం విశేషం. తొలి రోజు గ్రౌండ్‌లో ఉత్సాహంగా కనిపించాడు. వికెట్ పడినప్పుడల్లా బౌలర్లను అభినందించాడు. నేడు కోహ్లీ బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అభిమానుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే  రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌటైంది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. బెంగాల్‌తో మ్యాచ్‌లో పంజాబ్ 191 పరుగులకు ఆలౌటైంది.విదర్భను 190 పరుగులకే కుప్పకూల్చిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.