23-08-2025 12:05:07 PM
హైదరాబాద్: సీపీఐ అగ్ర నాయకులు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం(Suravaram Sudhakar Reddy Passes Away) పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని కేటీఆర్ పేర్కొన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) తన జీవితాన్ని ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం అంకితం చేశారని గుర్తుచేసుకున్నారు. నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా(Nalgonda Members of Parliament) ఆయన అందించిన సేవలు అపారమైనవన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువుటద్దమన్న కేటీఆర్ ఆయన పోరాట స్ఫూర్తి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, మిత్రులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు.